చారిత్రాత్మక వరంగల్‌ను విడగొట్టొద్దు: బీజేపీ

హన్మకొండ: చారిత్రక ప్రాధాన్యత కలిగిన హన్మకొండను ప్రత్యేక జిల్లాగా మార్చొద్దంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. హన్మకొండ బస్ డిపో దగ్గర భైఠాయించి నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు-ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ కారణంగా వ్యాపార సంస్థలను, స్కూళ్లను మూసివేశారు. జిల్లాను ఏర్పాటు చేసి తీరాతామని టీఆర్ఎస్ పెద్దలు పట్టుదలతో ముందుకు పోతే ప్రమాదాలు ఏర్పడతాయని బీజేపీ నేత ధర్మారావు తేల్చిచెప్పారు. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్‌ను విచ్ఛిన్నం చేయొద్దని ఆయన ప్రభుత్వాన్నికోరారు.Read More

Comments