Posts

Showing posts with the label Telangana

చారిత్రాత్మక వరంగల్‌ను విడగొట్టొద్దు: బీజేపీ

హన్మకొండ:  చారిత్రక ప్రాధాన్యత కలిగిన హన్మకొండను ప్రత్యేక జిల్లాగా మార్చొద్దంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. హన్మకొండ బస్ డిపో దగ్గర భైఠాయించి నేతలు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు-ఆందోళనకారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ కారణంగా వ్యాపార సంస్థలను, స్కూళ్లను మూసివేశారు. జిల్లాను ఏర్పాటు చేసి తీరాతామని టీఆర్ఎస్ పెద్దలు పట్టుదలతో ముందుకు పోతే ప్రమాదాలు ఏర్పడతాయని బీజేపీ నేత ధర్మారావు తేల్చిచెప్పారు. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్‌ను విచ్ఛిన్నం చేయొద్దని ఆయన ప్రభుత్వాన్నికోరారు. Read More

ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం...!

Image
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ఇంట్లో ఎవరులేని సమయంలో  ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన కీచకుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు రెబ్బెన పొలుసులకు పిర్యాదు చేశారు,  దింతో ఊట టీనా పోలీసులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకొని సంఘటన స్థల పూర్వాపరాలను పరిశీలించారు.  అనంతరం సంఘటనకు పాల్పడ్డ గోలేటిరామయ్య పై కేసు నమోదు చేసిన్నట్లు సి ఐ కర్ణాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే  శనివారం రోజు రామ చంద్రయ్య వారి భార్యతో పొలం పనులకు వెళ్లగా తన ఇంటిపక్కనే ఉన్న గోలేటి రామయ్య 38 సంవత్సరాల వ్యక్తి పక్కనే ఉన్న చంద్రయ్య ఇంట్లో ఎవరు లేరనే విషయాన్నీ గమనించి, చంద్రయ్య రెండవ కూతురైన మానసిక వికలాంగురాలి పై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు, దింతో పోలీసులు  ఐపీసీ 376 ప్రకరం నిందుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు మరియు  నిందుతుడు పరారీలో ఉన్నట్లు  తాండూర్  సి ఐ కర్ణాకర్  తెలిపారు. Read More