నర్సింగ్ సర్టిఫికెట్ల పరిశీలనకు నోటిఫికేషన్
నాలుగేళ్ల నర్సింగ్ కోర్సులో అడ్మిషన్ పొందగొరే విద్యార్ధుల సర్టిఫికెట్ల పరిశీలనకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్ధులు కూడా ఈ చివరి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 30 నుంచి వచ్చే నెల 4 వరకు కూకట్పల్లిలోని జేఎన్టీయూ క్యాంప్సలో హాజరుకావాలని యూనివ ర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు * www.knruhs.in * వైబ్సైట్ను సందర్శించాలని తెలిపారు.